03.01.2010 ఉదయాన్నే ఈతెలుగు బృందం సభ్యులు శ్రీ కశ్యప్ గారు, శ్రీ చక్రవర్తి గారు, శ్రీ సతీష్ గారు, డా. కౌటిల్య గారు విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుండి ఏర్పాట్లలో నిమగ్నమై నన్ను, నవ్వులాట శ్రీకాంత్ గారిని కాంటాక్ట్ లొ ఉంచుకుని ఆ రోజు కార్యక్రమాలపై చర్చించి ఉ. 11 గం. ల కల్లా వాసవ్య మహిళా మండలి చేరుకున్నారు. అంతకు ముందు రోజే వాసవ్య మహిళా మండలి అద్యక్షురాలు, మాజి పార్లమెంటేరియన్ మరియు ప్రముఖ సంఘసేవకురాలైన శ్రీమతి చెన్నుపాటి విద్య గారిని, వాసవ్య మహిళామండలి కార్యదర్శి అయిన శ్రీమతి రశ్మి గారిని నేను, నవ్వులాట శ్రాకాంత్ గారు కలిసి వారి సహాయ సహకారాలను కోరి వారి అనుమతి తో వారి ఆర్గనైజేషన్ లొ కంప్యూటర్ పై పనిచేసే దాదాపు 25 మందికి, ఔత్సాహికులకు ఈ-తెలుగు కార్యక్రమాలపై అవగాహన, శిక్షణ మరియు సాంకేతిక సహాయం అందించేందుకు ప్రణాళిక తయారుచేయటం జరిగింది. తదనుగుణంగా 03.01.2010 తేది ఉదయం 11.00 గం. లకు కార్యక్రమం ప్రారంభించేందుకు ఉద్యుక్తులౌతుండగా, వాసవ్య మహిళా మండలి లొ పనిచేసే శ్రీ ప్రసాద్ గారు అక్కడే వేరే ప్రోగ్రాం విషయం లొ వచ్చి ఉన్న మీడియావారికి మమ్మలను పరిచయం చేయటం, వారెంతొ ఆసక్తి కనబరచి ప్రెస్ మీట్ పెట్టమని అడగటం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ-తెలుగు సభ్యులు, విజయవాడ నుండి నేను, శ్రీ శ్రీకాంత్ గారుఆ సమావేశంలొ పాల్గొని ఆ-తెలుగు ఆర్గనైజేషన్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, లక్ష్యాలు వివరించటం జరిగింది. ఎంతో ఆసక్తిగా మీడియా వారు అనేక విషయాలపై చర్చించారు కూడా. ఆ సమావేశం వీడియో క్రింద చూడండి.
తదనంతరం వాసవ్య మహిళా మండలి హాల్ లొ దాదాపు 30 మంది కి ఎల్.సి.డి ప్రొజెక్టర్ వినియోగించి డెమో ఇవ్వటం, వారి యాక్టివ్ ఇంటరాక్షన్ తొ ఎంతొ లైవ్లీ గా కార్యక్రమం జరిగింది. ఎంతో ఎంతో ఒత్తిడి పనులలొ మునిగిపోయి ఉన్నప్పటికి శ్రీమతి రశ్మి గారు ఈ కార్యక్రమానికి హజరై ఈ నైపుణ్యాలు ఉపయోగించి బ్లాగ్ లు క్రియేట్ చేసుకోవాలని, వాటి ద్వారా అందరికి ఉపయోగపడే విధంగా పోస్ట్ లు చేసి పేరుతెచ్చుకోవాలని, ఎదుటి వారిని విమర్శించటం కాకుండా తమ తమ భావాలను, తమకు తెలిసి పది మందికి ఉపయోగపడే విషయాలను మాత్రమే బ్లాగ్ ల లో వ్రాయాలని అనేక ఉదాహరణలతో వివరించి, ఇంత మంచి కార్యక్రమానికి తమ వాసవ్య మహిళా మండలి ని ఎంచుకున్నందుకు ఈ-తెలుగు ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ కార్య క్రమానికి సంబంధించిన వీడియో మరియు కొన్ని ఫోటోలను క్రింద చూడవచ్చు. దాదాపు మద్యాహ్నం గం. 2.30 ని. లకు కార్యక్రమాన్ని ముగించి సాయంత్రం కార్య క్రమాన్ని విజయవాడలో జరుగుతున్న 21 వ పుస్తక మహోత్సవం లొ నిర్వహించటానికి తగిన ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది.
వాసవ్య మహిళా మండలి వారికి, వారి సిబ్బందికి ఈ-తెలుగు తరఫున కృతజ్ఞత లు తెలియచేసుకుంటూ ఈ పోస్ట్ ను ముగిస్తున్నాను.
మీ కంప్యూటర్ కు పెన్ డ్రైవ్ తో తాళం వేసుకోండి!
మన కంప్యూటర్ ను పెన్ డ్రైవ్, మెమొరీ కార్డ్ తో సహా ఏ USB storage device తో నైనా తాళం వేసుకునేందుకు ఒక సాఫ్ట్వేర్ అందుబాటులొ ఉంది. అదే Active Lock. దీనిని మనం http://en.lanctrl.com/ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ వెర్షన్ 3.0 ఇపుడు మనకు అందుబాటులొ ఉంది.
మనం ఎక్కువగా ఉపయోగించే USB storage device పెన్ డ్రైవ్ లేదా మెమొరీ కార్డ్ ను ఉపయోగించి మన కంప్యూటర్ కు తాళం వేయవచ్చు. క్రింది సోపానాలను గమనించండి
1. ఈ Active Key ప్రోగ్రాం ను రన్ చేసినపుడు మనకు పైన చూపించిన మొదటి ఇమేజ్ లా ఓపెన్ అవుతుంది.
2. మన USB storage device ను కంప్యూటర్ లొ ఇన్సర్ట్ చేసిన తర్వాత USB key drive అనేదానిలొ దాని డ్రైవ్ లెటర్ చూపిస్తుంది.
3. ఇపుడు మనం Lock computer when USB key removed అనేది చెక్ చేయాలి.
4. తర్వాత "Enable" అని ఉన్న బటన్ ను క్లిక్ చేయాలి.మనం USB storage device ను ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ బటన్ ను క్లిక్ చేసినపుడు క్రింది విధంగా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ధీనికి, మనం USB storage device ఇన్సర్ట్ చేయకుండా "Enable" బటన్: క్లిక్ చేసినపుడు వచ్చిన మెసేజ్ (పైన చూపించిన 2 వ ఇమేజ్ చూడండి) కి తేడా చూడండి. మీ USB key పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది. అది పోగొట్టుకుంటే వేరెవరో కాదు, మీరు కూడా మీ కంప్యూటర్ తాళం ను తీయలేరు. జాగ్రత్త సుమా!
5. ఇపుడు మనం Safely Remove Hardware విధానంలో మనం మన USB storage device ను రీమూవ్ చేస్తాం.
అలా రిమూవ్ చేసినపుడు కంప్యూటర్ ను లాక్ చేసేస్తుంది. దానితో పాటు Please insert USB key అనే డైలాగ్ బాక్స్ వస్తుంది.
పై విధంగా ఒక USB storage device తో అనేక కంప్యూటర్లను తాళం వేయవచ్చు లేదా అనేక కంప్యూటర్లను వేరే వేరే USB storage device లతో తాళం వేయవచ్చు. కాని దానిని మాత్రం పోగొట్టుకోండి, సిస్టం రీబూట్ చేసినా అది లేనిదే తాళం తెరుచుకోదు.
అదే విధంగా మనం "Disable" అనేది క్లిక్ చేసినపుడు మనకు క్రింది విధమైన మెసేజ్ వస్తుంది.
లేటెస్ట్ వెర్షన్ 3.0 ఇపుడు మనకు అందుబాటులొ ఉంది.
మనం ఎక్కువగా ఉపయోగించే USB storage device పెన్ డ్రైవ్ లేదా మెమొరీ కార్డ్ ను ఉపయోగించి మన కంప్యూటర్ కు తాళం వేయవచ్చు. క్రింది సోపానాలను గమనించండి
1. ఈ Active Key ప్రోగ్రాం ను రన్ చేసినపుడు మనకు పైన చూపించిన మొదటి ఇమేజ్ లా ఓపెన్ అవుతుంది.
2. మన USB storage device ను కంప్యూటర్ లొ ఇన్సర్ట్ చేసిన తర్వాత USB key drive అనేదానిలొ దాని డ్రైవ్ లెటర్ చూపిస్తుంది.
3. ఇపుడు మనం Lock computer when USB key removed అనేది చెక్ చేయాలి.
4. తర్వాత "Enable" అని ఉన్న బటన్ ను క్లిక్ చేయాలి.మనం USB storage device ను ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ బటన్ ను క్లిక్ చేసినపుడు క్రింది విధంగా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ధీనికి, మనం USB storage device ఇన్సర్ట్ చేయకుండా "Enable" బటన్: క్లిక్ చేసినపుడు వచ్చిన మెసేజ్ (పైన చూపించిన 2 వ ఇమేజ్ చూడండి) కి తేడా చూడండి. మీ USB key పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది. అది పోగొట్టుకుంటే వేరెవరో కాదు, మీరు కూడా మీ కంప్యూటర్ తాళం ను తీయలేరు. జాగ్రత్త సుమా!
5. ఇపుడు మనం Safely Remove Hardware విధానంలో మనం మన USB storage device ను రీమూవ్ చేస్తాం.
అలా రిమూవ్ చేసినపుడు కంప్యూటర్ ను లాక్ చేసేస్తుంది. దానితో పాటు Please insert USB key అనే డైలాగ్ బాక్స్ వస్తుంది.
పై విధంగా ఒక USB storage device తో అనేక కంప్యూటర్లను తాళం వేయవచ్చు లేదా అనేక కంప్యూటర్లను వేరే వేరే USB storage device లతో తాళం వేయవచ్చు. కాని దానిని మాత్రం పోగొట్టుకోండి, సిస్టం రీబూట్ చేసినా అది లేనిదే తాళం తెరుచుకోదు.
Subscribe to:
Posts (Atom)



















